హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సాధికారతకు పాటు పడుతున్నది. మహిళలకు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత వాటి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లుగా మహిళలకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారన్నారు. ఈ మేరకు మహిళల పక్షాన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
గ్రేటర్ వరంగల్ మేయర్గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా లు ఎన్నిక కావడం పట్ల మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట చైర్ పర్సన్ గా కడవేర్గు మంజుల, కొత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా బత్తుల లావణ్య యాదవ్, జడ్చర్ల చైర్ పర్సన్ గా దొరిపల్లి లక్ష్మి, నకిరేకల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉమారాణి, అచ్చంపేట వైస్ చైర్ పర్సన్ శైలజా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక కావడం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే