కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్త వేరియంట్ కరోనా కలకలం సృష్టిస్తున్నది. సార్స్ సీఓవీ2 వైరస్ వేరియంట్ను B.1.618గా గుర్తించారు. ఇండియాలో కరోనాకు చెందిన వేరియంట్ను గుర్తించడం ఇది రెండవది. డబుల్ మ్యూటెంట్ వైరస్గా పిలవబడుతున్న B.1.617ను ఇప్పటికే ఇండియాలో పసికట్టిన విషయం తెలిసిందే. బెంగాల్లో ఉన్న పాజిటివ్ కేసుల్లో B.1.618 ఉన్నట్లు సీఎస్ఐఆర్ పరిశోధకుడు వినోద్ స్కారియా తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో కరోనా B.1.618 రకాన్ని ఓ బెంగాల్ రోగిలో గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్లు అమెరికా, స్విట్జర్లాండ్, ఫిన్ల్యాండ్, సింగపూర్లో ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. B.1.618 రకానికి చెందిన కరోనాలోని స్పైక్ ప్రోటీన్లో అమినో యాసిడ్స్ లేనట్లుగా తేల్చారు. బెంగాల్లో జనవరి నుంచి ఈ రకం వైరస్ ఉన్న కేసులు పెరుగుతున్నాయన్నారు. కానీ కరోనా ఉదృతికి ఇదే కారణమని కూడా చెప్పాలేమని వినోద్ పేర్కొన్నారు.