మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. పలు చొట్ల రేషన్ కార్డులు అందించారు. మందమర్రి నుంచి ఆవడం వరకు 8.45 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ శంకుస్థాపన చేశారు. మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు అందించించారు. అలాగే మందమర్రి మున్సిపాలిటీలో రూ.30కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను విప్ బాల్క సుమన్ పరిశీలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో 33/11KV సబ్ స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు