పుట్టిన రోజున ఔదార్యం
సిద్దిపేట, జూన్ 3 : తన పుట్టినరోజున పలువురు ఆభాగ్యులకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథ బాలికకు గతంలో మంత్రి హరీశ్రావు చేరదీసి బాలసదన్లో ఉంది చదివించి పెద్దచేశారు. అంతేకాకుండా ఆమెకు పెండ్లి చేయించారు. తాజాగా గురువారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి హరీశ్రావు భాగ్యకు సిద్దిపేట కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇంటిని ఇప్పించి అండగా నిలిచారు. భాగ్యకు డబుల్ బెడ్రూం ఇంటి పట్టా, తాళం చెవి అందజేశారు.
ఆటోవాలాకు…
ఆటోవాలా కుటుంబాలకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఇటీవల దురదృష్టవశాత్తు అనారోగ్యంతో సిద్దిపేటకు చెందిన పిడిశెట్టి దుర్గయ్య మృతి చెందగా, ఆ కుటంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును తన పుట్టిన రోజున మంత్రి అందజేశారు. తన పుట్టిన రోజున రెండు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ఆనందంగా ఉందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.