హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా కోరల్లో చిక్కుకోవడం తో ఒంటరిగా ఉండే పిల్లల కోసం రాష్ట్ర ప్రభు త్వం శిశువిహార్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాన్ని స్త్రీశిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతిరాథోడ్ గురువారం ప్రారంభించారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్లోని శిశువిహార్లో ఈ ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శిశువిహార్లో పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇక్కడ కొవిడ్ బారిన పడిన పిల్లలను తక్షణమే సమీప దవాఖానలకు తరలించేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చైల్డ్లైన్ హెల్ప్డెస్క్ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.