హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): భూసేకరణ కోర్టు ధికార కేసుల్లో పరిహారం చెల్లింపుల నిమిత్తం జీవో 208 ద్వారా రూ.58.95 కోట్లను మంజూరు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఆ నిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టుధికార కేసుల విచారణకు మంజూరు చేసినట్టుగా తప్పుగా అర్థం చేసుకొని పిల్ వేశారని తెలిపింది. ఈ పిల్పై బుధవారం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పిల్ పై విచారణ జరిగే సమయానికి ఆ వివరాలు తమకు అందలేదని, జీవో ద్వారా నిధుల మంజూరు లక్ష్యాలను వివరిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. పిటిషనర్ జీవో 208ని తప్పుగా అర్థం చేసుకుని హైకోర్టులో పిల్ వేశారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. రద్దు చేస్తేనే భూపరిహార చెల్లింపులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగుతాయని తెలిపారు. పిటిషనర్ ధర్మాసనానికి ఇచ్చినది తప్పుడు సమాచారమని సకాలంలో చెప్పలేకపోయామన్నారు. ఏజీ అభ్యర్థనపై ఈ నెల 9న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. జీవోలో భాష సరిగ్గా లేకపోవడం వల్ల తప్పుగా అర్ధం చేసుకునేలా ఉందని వ్యాఖ్యానించింది.