వర్ధన్నపేట, ఏప్రిల్ 10: గోవులను సంరక్షించుకుంటేనే వ్యవసాయ ప్రగతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మండలంలోని రామవరంలో శ్రీవెంకటేశ్వర గోశాల ఫెడరేషన్ ద్వారా 20 మంది రైతులకు 40 లేగదూడలను శనివారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగడంతో పాడిపశువుల పెంపకం తగ్గిపోయిందన్నారు. యంత్రాలతో సాగు చేయడం వల్ల భూముల్లో సారం తగ్గి నాణ్యమైన దిగుబడి రావడం లేదని తెలిపారు. రసాయన ఎరువులు వాడిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ప్రజలు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు విధిగా పాడి ఆవులు, గేదెలను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గాడిపెల్లి రాజేశ్వర్, సర్పంచ్ కర్ర వెంకట్రెడ్డి, నారాయణపేట గోరక్షణ ప్రతినిధి సత్యవన్నాయక్, స్థానిక ఫెడరేషన్ ప్రతినిధులు బదావత్ యాకుబ్, కుల్ల కొమ్మాలు, దాసరి ఆంజనేయులు, రాంచంద్రు, ఉపేంద్ర పాల్గొన్నారు.
గొట్లకొండలో లేగదూడల పంపిణీ
నెక్కొండ: మండలంలోని గొట్లకొండలో శనివారం తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షులు గాడెపల్లి రాజేశ్వర్, మహేశ్వర్ అగర్వాల్ ఆధ్వర్యంలో పదిమంది నిరుపేద రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున లేగదూడలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు విధిగా గోవులను సాకాలని, వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో గణేశ్, వెంకన్న, రోజ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జోడేఘాట్ను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్లు
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా