వికారాబాద్ : స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి మండల పరిధిలోని రాఘవ పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం , పల్లె ప్రకృతి వనాలను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే రంగంపల్లిలో వైకుంఠధామం, గడిసింగపూర్ గ్రామంలో రైతు వేదికను, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో చెక్ డ్యాంను ప్రారంభించి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
సర్పంచ్ లకు ఒక దిశ నిర్దేశం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని తెలిపారు. చెత్త స్వాగతం పలికే చోట నుంచి నేడు డంపింగ్ యార్డుల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామాలుగా మార్పు చెందాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పరిగి మండలంలో 20 కోట్ల రూపాయలు రైతుబంధు కింద 15వేల 961 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలి.
గ్రామాలు పచ్చగా మారేందుకు అందరూ కృషి చేయాలన్నారు. వారసులకు ఆస్తి పాస్తుల తో పాటు భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం కూడా ఇవ్వాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక