అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడురోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వెల్లడించింది.
కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని పేర్కొంది. రాయలసీమలో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.