వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, జూన్ 5: కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్, వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం రైతుబజార్, కూరగాయల మార్కెట్, చికెన్షాప్, వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్తుందని గుర్తుచేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.