కంటోన్మెంట్, మే 21: బోయిన్పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వృద్ధురాలికి సపర్యలు చేసి..భోజనం పెట్టారు. శుక్రవారం ఓ వృద్ధురాలు అచేతన స్థితిలో పడి ఉందని పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. న్యూ బోయిన్పల్లి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విజయ్కుమార్, నజీర్ పాషాకు విషయాన్ని చేరవేశారు. వృద్ధురాలి వద్దకు వచ్చిన వారు ఆమెకు సపర్యలు చేసి.. భోజనం తినిపించారు. మంచినీళ్లు తాగించి..దుస్తులు మార్చారు. కోలుకున్నాక వివరాలు సేకరించారు. బోయిన్పల్లిలో తన తమ్ముడు ఉంటున్నాడని చెప్పడంతో ఆమెను అతడికి అప్పగించారు. ఈ సందర్భంగా పెట్రోలింగ్ సిబ్బందిని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై సుధాకర్రెడ్డి అభినందించారు.