వెబ్ కౌన్సెలింగ్పై ప్రత్యేక సెమినార్
తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సర్.. ఎంసెట్లో 106 ర్యాంకు వచ్చింది. ఏ కాలేజీలో సీటొస్తుంది? ఇంటర్ తర్వాత ఏ ఉన్నత విద్యతో మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు? ఇలా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న ఎన్నో సందేహాలను తీరుస్తున్నది టీ న్యూస్, అపెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021. రెండోరోజు శుక్రవారం కూడా ఫెయిర్కు అనూహ్య స్పందన లభించింది. పూర్తి ఉచితంగా ప్రవేశం కల్పించడంతో ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు భారీగా ఫెయిర్కు తరలివచ్చారు. అక్కడ వందకుపైగా ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కాలేజీల స్టాళ్లను సందర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్పై ఫెయిర్ వేదికగా సీనియర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో టీన్యూస్ సీజీఎం ఉపేందర్, అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎండీ దినేశ్కుమార్ గట్టు, టీన్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ బృందం సత్యపాల్ శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021కి ప్లాటినం స్పాన్సర్గా మర్రి లక్ష్మణ్రెడ్డి విద్యాసంస్థలు, డైమండ్ స్పాన్సర్గా సీఎంఆర్ విద్యాసంస్థలు, గోల్డెన్ స్పాన్సర్గా మల్లారెడ్డి యూనివర్సిటీ ముందుకొచ్చాయి. ఎడ్యుకేషన్ ఫెయిర్ చివరిరోజు శనివారం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.