బీబీపేట్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి, మే 11: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ కిట్లను అందజేసి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తునారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతున్నది. బీబీపేట్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం 19 మందికి టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని హెచ్ఈవో శంకర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం తాజాగా పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 72 మందికి సెకండ్ డోస్ టీకాలు ఇచ్చారు. 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మండల పరిధిలోని మత్తమాల పీహెచ్సీలో 75 మందికి కొవిడ్ సెకండ్ డోస్ టీకాలు ఇచ్చారు.
55 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానతోపాటు, ఉత్తునూర్ ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా 39 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. ఉత్తునూరు పీహెచ్సీలో 30 మందికి, గాంధారి దవాఖానలో 73 మందికి సెకండ్డోస్ టీకాలు వేశామన్నారు. మండలంలో ఇప్పటివరకు 13,945 మందికి కొవిడ్ టీకాలు వేశామని తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల్లు వైద్య సిబ్బంది తెలిపారు. మండలవ్యాప్తంగా మంగళవారం 63 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.
లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సమీనా తెలిపారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 38 మందికి పరీక్షలు నిర్వహించారు. అయ్యపల్లి తండా, శెట్పల్లి గ్రామాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలిపారు. వేరే మండలానికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. 106 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. తాడ్వాయి మండల పరిధిలోని ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 40 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. 95 మందికి సెకండ్ డోస్ టీకా వేశామన్నారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.