‘గ్రేటర్’ ఆశావహుల్లో ఉత్కంఠ
ఇప్పటి నుంచే నాయకుల లెక్కలు
ఓటర్ల గుర్తింపు నేపథ్యంలో రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
వరంగల్, ఏప్రిల్ 5: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. డివిజన్ల పునర్వి భజన పూర్తికాగా నగారా ఎప్పుడైనా మోగనున్న క్రమంలో ఆశావహులకు టెన్షన్ పట్టుకుంది. ఓ వైపు కార్పొరేటర్ కావా లనే ఆశ.. మరోవైపు రిజర్వేషన్ భయం వారిని కలవరపెడు తున్నది. ఇప్పటినుంచే తమ ప్రాంతాల్లో కలియదిరుగుతూ ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న పట్టు ఎంత..? ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కల్లో బిజీ అవుతున్నారు.
ఓటర్ల గుర్తింపు నేపథ్యంలో..
డివిజన్ల పునర్విభజనపై ఉత్కంఠ వీడడంతో ఇప్పుడు ఆశా వహుల్లో రిజర్వేషన్ టెన్షన్ మొదలైంది. పునర్విభజన ముసా యిదాకు ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేపట్టాలని ఆదేశించింది. ఈ మేర కు గ్రేటర్ అధికారులు గుర్తింపు ప్రక్రియను వేగంగా కొనసాగి స్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్ కలిసి వస్తుందో, లేదోనని? టెన్షన్ పడుతున్నారు. కొంతమం ది రిజర్వేషన్ జనరల్ అయినా.. మహిళ అయినా పర్వా లేదు పోటీ చేస్తామంటున్నారు. కొత్త డివిజన్లలో ఇప్పటికే కొందరు ముందస్తు ప్రచారం మొదలు పెట్టారు. ఆయా చోట్ల కలిసొచ్చే అంశాలను అంచనా వేసుకుంటూ మద్దతు కోసం ప్రయత్నా లు చేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓట్లపై లెక్కలు వేసుకుంటూ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
పెరిగిన పోటీ
పాత, కొత్త కలయికతో ఏర్పడిన డివిజన్లలో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. ప్రస్తుతం కొత్త డివిజన్ల కూర్పులో కొన్ని కాలనీలు అటూఇటూ కలిశాయి. ఇప్పటికే ఒక్కో డివిజ న్లో ముగ్గురు నుంచి ఐదుగురు టికెట్ ఆశిస్తుండగా కొత్త లీడర్ల సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తున్నది. పోటీని తట్టుకుంటూ తమ గాడ్ఫాదర్లపై నమ్మకంతో కొందరు ముం దస్తు ప్రచారంలోకి దిగుతున్నారు.
డివిజన్ల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితా
గ్రేటర్ కార్పొరేషన్లోని 66 డివిజన్ల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ఎన్నిక ల సంఘం ఆదేశాలతో సోమవారం బల్దియా నోటీస్బోర్డుపై ప్రదర్శించారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై అంటించాలని కమిషనర్ పమేలా సత్పతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాబితాను ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అందజే శారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులుంటే ఈ నెల 8లో గా లిఖితపూర్వకంగా అందజేయాలని కమిషనర్ సూచించా రు. గడువులోగా వచ్చిన అభ్యంతరాలను ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎన్నికల సంఘం నిబంధన మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. మార్పులు, చేర్పులు, అభ్యంత రాలను సరిచేసి తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు.
పోలింగ్ స్టేషన్కు 800 ఓట్లే..
గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండేందుకు బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి బ్యాలె ట్తో ఓటింగ్ జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగనుంది. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 800 ఓట్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్లో ని 6,52,978 మంది ఓటర్లకు గాను 817 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ్రప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో సుమారు 157 పోలింగ్ స్టేష న్లను అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 2016 ఎన్నికల్లో 660 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఒక్కో డివిజన్లో పదికి పైనే..
గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్కు 12 నుంచి 13 పోలింగ్ స్టేష న్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో డివిజన్లో 10వేలకు పైగా ఓటర్లున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో 800 ఓట్లకు మించకూడదన్న ఆదేశాలతో ప్రతి డివిజన్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యం లోనే రెండు, మూడు రోజుల్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లను పరి శీలించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: మావోయిస్టుల చెరలో జవాన్ రాకేశ్వర్సింగ్
కరోనా కట్టడికి కసరత్తు : 8న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ