డేట్స్ సమస్యల వల్ల నచ్చిన కథల్ని వదులుకోవడం హృదయాన్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని మంచి కథలు మిస్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మట్లాడుతూ ‘ప్రస్తుతం నేను మూడు భాషల్లో బిజీగా ఉన్నా. ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ఎంతగా కష్టపడుతున్నానో అందరూ చూస్తున్నారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మంచి ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వస్తోంది. అయితే దర్శకనిర్మాతలు సహృదయంతో నన్ను అర్థం చేసుకుంటున్నారు. సినిమాకు అంగీకరించి అందరిని నా కోసం నిరీక్షించేలా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎవరిని నిరుత్సాహపరచకూడదని నాకున్న సమయంలోనే సాధ్యమైనంత వరకు ఎక్కువ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి చిత్రానికి అంకితభావంతో పనిచేయడంతో పాటు ఆయా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తున్నా’ అని చెప్పింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్ని చేస్తోంది.