కరీంనగర్ జిల్లా మల్యాలలో గొల్ల, కురుమల తీర్మానం
ఇల్లందకుంట/ కమలాపూర్, ఆగస్టు 10: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గొల్ల, కురుమలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గొల్ల, కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, గోసుల శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో యాదవులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం తీర్మాన ప్రతిని గోసుల శ్రీనివాస్యాదవ్కు అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్పల్లి ఆరె కులస్థులు టీఆర్ఎస్ వెంటే ఉంటామని తీర్మానించి రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుకు అందజేశారు.