హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): జపాన్లోని కన్సాయ్ వేదికగా నిర్వహించిన 53వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలంపియాడ్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి మధుర్ ఆదర్శ్రెడ్డి గోల్డ్మెడల్ను సొంతం చేసుకున్నా రు. మన దేశం నుంచి నలుగురు విద్యార్థులు పోటీలకు హాజరుకాగా.. 2 గోల్డ్, 2 సిల్వర్మెడల్స్ను సొం తం చేసుకున్నారు. దక్షిణాదినుంచి ఆదర్శ్రెడ్డి ఒక్కరే పాల్గొని గోల్డ్మెడల్ సాధించారు. ఆదర్శ్రెడ్డిని నారాయణ విద్యాసంస్థల ఎండీ పీ సింధూర నారాయణ అభినందించారు.