దహెగాం, ఏప్రిల్ 7 : గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే అధికారులు తక్షణమే స్పందించాలని జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామరావు అన్నారు. ఎంపీపీ కంబగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఇన్చార్జి వ్యవసాయాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2018 నుంచి ఇప్పటి వరకు 85 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారని, వారి కుటుంబాలకు రైతు బీమా అందినట్లు తెలిపారు. శనగల కొనుగోలు కేం ద్రం ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపామన్నారు. మండలంలో ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణ యజమానులు అధిక ధరలకు యూరియా విక్రయాయిస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ శ్రీరామరావు వ్యవసాయాధికారులకు సూచించారు. డీటీ బక్కయ్య మాట్లాడుతూ.. మండలంలో 17 రేషన్ షాపులద్వారా 8,112 రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యాధికారి చంద్రకిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పీహెచ్సీలో 45 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. డీఈ సిద్ధిక్ మాట్లాడుతూ.. మండలంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్, విద్య, తాగునీరు తదితర శా ఖలపై చర్చ నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
చెడ్డీలోనే పెండ్లికొడుకు..షాకైన జనం