కాళేశ్వరంలో కొనసాగుతున్న ఎత్తిపోతలు
పెద్దపల్లి, జూన్ 19(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజె క్టు పరిధిలో ఎత్తిపోతలతో గోదారమ్మ ఎగువకు పరుగులు తీస్తున్నది. పంపుల నిండుగా వస్తున్న నీటితో జలాశయా లు మురిసిపోతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో లక్ష్మి బరాజ్లో శనివారం 5 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. గత నాలుగు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని లక్ష్మి పంప్హౌస్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్హౌస్ వరకు మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. శనివారం లింక్ – 1లోని లక్ష్మి పంప్హౌస్లో 11, సరస్వతిలో 6, పార్వతిలో 5, లింక్-2లోని నందిపంప్హౌస్లో 3, గాయత్రి పంప్హౌస్లో 3 చొప్పున మొత్తం 28 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు.
ప్రాజెక్టులకు మొదలైన వరద
హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ), ధరూరు/అయిజ: ప్రాజెక్టులకు వరద మొదలైంది. జూరాలకు శనివారం 2,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2,693 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. తుంగభద్ర డ్యాంకు 27,947 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 232 క్యూసెక్కుల అవుట్ఫ్లో వస్తున్నది. శ్రీశైలానికి 7,416 క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 3,834 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమం గా పెరుగుతున్నది. శనివారం నాటికి 18,564 క్యూసెక్కుల వరద వచ్చింది.