మన్సూరాబాద్/కంటోన్మెంట్/మేడ్చల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఎల్బీనగర్ నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి ఆనంద్నగర్ చౌరస్తాలోని తెలంగాణ మైనార్ట్సీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆనంద్నగర్ తెలంగాణ మైనార్ట్సీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 165 మంది విద్యార్థులు ఉంటున్నారు. తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో కొందరికి ఒంటి నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపించడంతో వారు ప్రిన్సిపాల్ వినీల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న వైద్య సిబ్బంది విద్యార్థులతో పా టు, ఉపాధ్యాయులకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 184 మందిలో 9,10వ తరగతి చదువుతున్న 36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అ య్యింది. వీరిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేకపోగా.. కేవలం నీరసం, ఒంటి నొప్పులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
కరోనా నిర్ధారణ అయిన 36 మందికి పాఠశాలలోని 5వ ఫ్లోర్లో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి చికిత్స అం దిస్తున్నారు. కిట్లను అందజేసి ఒక ఏఎన్ఎం, స్టాఫ్ న ర్సుల పర్యవేక్షణలో ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాజిటివ్ నిర్ధారణ అయిన విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టు లు నిర్వహించి శాంపిల్స్ను ఉస్మానియాకు పంపించారు.
పాఠశాలలోకి ఎవరికీ అనుమతి లేకున్నా విద్యార్థులకు ఎలా కరోనా సోకిందనే విషయం అంతుచిక్కడం లేదు. కేవలం రెండు రోజుల నుంచే విద్యార్థుల్లో కొందరికి ఒంటి నొప్పులు, నీరసం వచ్చినట్లు ప్రిన్సిపాల్ వినీల తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకొని నెగెటివ్ వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అనుమతితో ఇండ్లకు తీసుకెళ్లారు.
కంటోన్మెంట్ పరిధి బోయిన్పల్లిలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో 89 మంది విద్యార్థులుండగా.. అందులో ముగ్గురు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వార్డెన్ లాలూ సమాచారం మేరకు వారికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో నాగర్కర్నూల్కు చెందిన ఇద్దరు, నల్లగొండకు చెందిన ఒకరు ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిగతా విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతించారు.
కరోనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్య బృందం అందుబాటులో ఉందని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. కరోనా సోకిన వారికి ఒ ళ్లు నొప్పులు, నీరసం తప్ప ఇతర లక్షణాలు లేవు. గురుకుల పాఠశాలలోనే మెడికల్ శిబిరం ఏర్పాటు చేశాం. అవసరమైతే దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్ను అందుబాటులో ఉంచాం. దవాఖానకు తరలించే పరిస్థితి రాదనుకుంటున్నాం. విద్యార్థులకు కరోనా వ్యాధి సోకడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. -మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు