హాలియా, జూన్ 23: రైతును లక్షాధికారిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకోసమే రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మూస పద్ధతుల్లో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నిడమనూర్ మండలం ఊట్కూరులో ప్రత్యామ్నాయ పంటలతో లాభాలను ఆర్జిస్తున్న రైతు నారాయణరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.