గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కోటా
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏ-4 మద్యం దుకాణాల లైసెన్స్ల కేటాయింపులో గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968లోని సెక్షన్ 17(1) (వీ) ప్రకారం 2021 సంవత్సరానికిగాను ఏ-4 మ ద్యం దుకాణాలకు రిటైల్ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కేటాయిస్తున్నామని ఆ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ను ఆదేశించారు.
వైన్స్లో రిజర్వేషన్లు చరిత్రాత్మకం
వైన్స్ల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభు త్వం రిజర్వేషన్లు అమలు చేయడం చరిత్రాత్మకమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీజీవో) నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు అన్ని రంగా ల్లో రిజర్వేషన్లు కల్పించి ఉన్నతస్థానాలకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసినవారిలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నాయకు లు సహదేవ్, వెంకటయ్య, ఎంబీ కృష్ణాయాదవ్, వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సుభాష్ ఉన్నారు.