ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..

మంచిర్యాల : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ధరణి పథకం విశేష ప్రజాధరణ పొందుతున్నది. భూ సమస్యలు తలెత్తకుండా చేపట్టిన ఈ వినూత్న పథకం పని తీరు ప్రశంసలను పొందుతున్నది. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన కాని పని ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చి భూములను రిజిస్ట్రేషన్ చేస్తుండటం పథకం పనితీరుకు అద్దం పడుతున్నది. జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన రత్న రాజిరెడ్డి తన 16 గుంటల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన శ్రావణ్ రెడ్డికి విక్రయించాడు.
కాగా, రాజిరెడ్డి అనారోగ్యానికి గురై తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. దీంతో తహసీల్దార్ రామచంద్రయ్య ధరణి ఆపరేటర్ తిరుపతితో కలిసి భూమిని అమ్మిన రైతు ఇంటికి వెళ్లారు. ఆ రైతు సంతకం, ఇతర వివరాలను నమోదు చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆన్లైన్ చేశారు. అనంతరం నక్కలపల్లి గ్రామానికి వెళ్లి అధికారులు భూమిని కొనుగోలు చేసిన రైతుకు పట్టా పాసు పుస్తకం అందజేశారు. అధికారుల పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు
‘అక్షరయాన్’ వెబ్సైట్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
తాజావార్తలు
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు