హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్..తాజాగా స్మార్ట్ పరికరాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగంలో సంస్థ స్మార్ట్ వాచ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.899 ప్రారంభ ధరతో లభించనున్న ఈ స్మార్ట్వాచ్, స్మార్ట్ బ్రాండ్లో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయని పేర్కొంది. కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఈ పరికరాలు లభించనున్నాయని పేర్కొంది. కరోనా కారణంగా ఆరోగ్యంపై జాగ్రత్తలు పెరిగాయని, దీంతో ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని కంపెనీ ఫౌండర్, సీఈవో అమీన్ ఖ్వాజా తెలిపారు.