హైదరాబాద్ : గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కంచర్ల రవీంద్రనాథ్ రూ.350 కోట్లతో ప్రపంచస్థాయి వైద్య విద్య పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు మంగళవారం వెల్లడించారు. గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ ఈ ప్రకటన విడుదల చేసింది. తన సంపదలో రూ. 350 కోట్లను గ్లోబల్ హెల్త్కేర్ యూనివర్సిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్కోసం కేటాయిస్తూ రిజిస్టర్డ్ వీలునామా రాశారు. వైద్య విద్య పరిశోధనల అవసరాలకు ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
జీహెచ్యూఐహెచ్లో అత్యాధునిక ప్రమాణాలతో మెడికల్ యూనివర్సిటీ, 750 నుంచి 1000 పడకలతో హాస్పిటల్ ఉంటుందని, విభిన్న రంగాల్లో పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెడుతుందని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలతోనూ నిత్యం సంప్రదింపులు జరుపుతూ పరిశోధనల్లో సాయపడుతుందని చెప్పారు.
ఇందుకు దాదాపు రూ. 700 కోట్లతో నిర్మిస్తున్న ఈ సంస్థ పూర్తికావడానికి ఏడేండ్లు పడుతుందని అంచనా వేశారు. ఇందులో రవీంద్రనాథ్ తన సంపాదనలో 70% మొత్తాన్ని ఇస్తున్నట్టు వెల్లడించారు. దీని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మరికొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుచేయబోయే జీహెచ్యూఐహెచ్.. ప్రభుత్వాలపై పరిశోధన, వైద్య చికిత్స భారాన్ని తగ్గిస్తుందని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పారు. తన సంకల్పం ఆగకుండా ఉండటానికి రిజిస్టర్డ్ వీలునామా ద్వారా దీనికి ఎగ్జిక్యూటర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.