నారాయణపేట : కొవిడ్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో వెనుక బడిన జిల్లాలో వెంటిలేటర్ సౌకర్యం కల్పించేందుకు గ్లాండ్ ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ డి. హరిచందన సమక్షంలో 8 వెంటిలేటర్లను గ్లాండ్ ఫార్మా సంస్థ ప్రతినిధులు దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్కు అందజేశారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రఘురాం, యన్.పి కిషోర్, డాక్టర్ శైలజ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్