వెన్నెముక కండరాల క్షీణత సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్కు చెందిన మూడేండ్ల బాలుడు ఆయాన్ష్ కోసం విదేశాల నుంచి తెప్పిస్తున్న మెడిసిన్కు పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ను కోరారు. ఆయాన్ష్ గుప్తా వెన్నెముక కండరాల క్షీణత సమస్య నుంచి బయటపడేందుకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్జెన్సిమా అనే డ్రగ్ను దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయాన్ష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు రూ.16 కోట్లు సేకరించారు. ఈ డ్రగ్ జూన్ 5న భారత్కు రానున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. దీనిపై మంగళవారం మంత్రి కేటీఆర్ ‘బాలుడి మెడిసిన్ను పన్ను నుంచి మినహాయించండి. ఇది ఆయాన్ష్కు ఎంతో సాయపడుతుంది’ అంటూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ను ట్విట్టర్లో కోరారు.