కేంద్ర మంత్రికి ఎంపీ వెంకటేశ్ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీ)లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటంతోపాటు స్థానిక ట్రాన్స్పోర్టర్లకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్షుక్ మాండ్విని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వాటర్ లీకేజీను అరికట్టాలని, భూనిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.