హైదరాబాద్ : దళిత సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పన నిమిత్తం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ సంతోషం కలిగించిందన్నారు. మరియమ్మ లాకప్డెత్ కేసులో వారి కుటుంబానికి సాయం చేస్తూ సీఎం తక్షణ స్పందన దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. దళిత సాధికారత కోసం ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని పేర్కొన్నారు.