ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, ఆగస్టు 5 : మండలంలోని అప్పపల్లి గ్రామానికి చెందిన శిరీష(15) కొత్తబట్టలు కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరీష పదో తరగతి చదువుతున్నది. తనకు కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. వారు కాదనడంతో పొలంలో పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శిరీష మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.