హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో బబ్లి అనే ఆడ జిరాఫీ న్యుమోనియా, క్షయతో మరణించినట్టు వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. తెలంగాణ వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వీబీఆర్ఐ) నుంచి తుది నివేదిక రావా ల్సి ఉన్నది. మే 4న లయన్ సఫారీలో ఎనిమిది సింహాలకు కరోనా సోకినట్టు సీసీఎంబీ-ల్యాకోన్స్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సకాలంలో సరైన చికిత్స అందించడం వల్ల అవి సం పూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాయి. కరోనా లక్షణాలు కనిపించిడంతో ల్యాకోన్స్ పరిశోధన జరుపుతున్నది. జిరాఫీ లాలాజలాన్ని కూడా తీసుకుని ల్యాబ్లో పరిశీలిస్తున్నది.