మంచిర్యాల: మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుపేద వృద్ధ దంపతులకు ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాగం మల్లయ్య, పోసక్కల చేత గృహ ప్రవేశం చేయించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందని పురాణం సతీష్ అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాన్నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నీయోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.