హైదరాబాద్ : నగరంలోని రామంతాపూర్ బీజేపీ కార్పొరేటర్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకున్న జీహెచ్ఎంసీ.. కార్పొరేటర్ బండారు శ్రీవాణికి రూ.80 వేల జరిమానా విధించింది. జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా కార్పొరేటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.