పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
శుభ్రంగా వీధులు. అద్దాల్లా రోడ్లు
అన్ని హంగులతో వైకుంఠధామం
హరిత స్వాగతం పలుకుతున్న ఎవెన్యూ ప్లాంటేషన్
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
ఎల్ఈడీ వెలుగుల్లో జిగేల్మంటున్న పల్లె
గొల్లపల్లి, మార్చి 29: దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన రాఘవపట్నం స్వయం పాలనలో సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్నది. పల్లె ప్రగతి ఫలాలను అందిపుచ్చుకుని ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అద్దాల్లాంటి రోడ్లతో మెరిసిపోతున్నది. పచ్చని ఎవెన్యూ ప్లాంటేషన్తో హరిత స్వాగతం పలుకుతున్నది. తీరొక్క మొక్కతో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేసుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఎల్ఈడీ వెలుగులతో జిగేల్మంటూ ఆఖరికి అవస్థలు పడకుండా సకల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని నిర్మించుకొని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పూర్వ కాలంలో ఇక్కడ సిక్కులు పెద్ద సంఖ్యలో ఉండగా, సిక్కుల రాఘవపట్నంగా పేరొందింది. తర్వాతి కాలంలో వీళ్లంతా వెళ్లిపోయారు. ప్రస్తుతంలో గ్రామంలో 2991 మంది జనాభా, 839 ఇండ్లు ఉన్నాయి. గ్రామంలో వివిధ పనుల కోసం పల్లెప్రగతి కార్యక్రమం కింద ప్రతి నెలా 4.16 లక్షల చొప్పున నిధులు వస్తున్నాయి. అందులో 10 శాతం నిధులు గ్రీనరీ, నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణకు, 15 శాతం నిధులు పారిశుధ్యం కోసం, 10 శాతం వీధి దీపాల నిర్వహణకు, 5 శాతం కార్యాలయ నిర్వహణకు వినియోగిస్తున్నారు. ప్రతి నెలా కార్మికుల జీతాలకు 56 వేలు, విద్యుత్ బిల్లు నెలకు 60వేలు నుంచి 70వేలు చెల్లిస్తున్నారు.
నిధుల్లో నుంచి ట్రాక్టర్, ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఎకరం స్థలంలో అన్ని రకాల పండ్ల మొక్కలతో మంకీ ఫుడ్ ఏర్పాటు చేశారు. 1.50 లక్షలతో ఆ స్థలాన్ని చదును చేశారు. మొక్కలు పెట్టి బోరు, మోటర్, కరెంట్, రక్షణ కంచె నిర్మాణం కోసం 3 లక్షలు ఖర్చు చేశారు. 6 లక్షలతో అత్యవసరమైన మురుగు కాల్వలు మూడింటిని నిర్మించారు. ఎకరం స్థలంలో వివిధ రకాల మొక్కలతో అందంగా పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. గుట్ట ప్రాంతంలో ఉన్న ఆ స్థలాన్ని చదును చేసేందుకు 1.50 లక్షలు ఖర్చు చేశారు. 20 గుంటల్లో సకల సౌకర్యాలతో 10.60 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు.
ఇవి కూడా చదవండి
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ప్రమోషన్కు వచ్చిన పవర్ స్టార్.. ఇంటర్వ్యూలతో రచ్చ రచ్చ