హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నానాటికీ పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం.. అనూహ్యంగా విస్తరిస్తున్న సైబర్ దునియాలో ఎలా జాగ్రత్తగా ఉండాలన్న కీలక విషయాలపై రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైబర్ కాంగ్రెస్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ‘లెర్న్.. షేర్.. రిపీట్..’ థీమ్తో 10 నెలల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ద్వారా జిల్లాలవారీగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి పాఠశాల నుంచి ఒక టీచర్తోపాటు ఆసక్తి, నాయకత్వ లక్షణాలున్న విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎంపికచేశారు. మొత్తం 1,650 మంది ఉపాధ్యాయులు, 3,300 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రధానంగా డిజిటల్ సిటిజన్షిప్, టెక్నాల జీ వినియోగంలో మన బాధ్యతలు ఏంటి? అనుసరించాల్సిన విధానాలు.. ఎథికల్ డిజిటల్ జనరేషన్, ప్రస్తు తం జరుగుతున్న సైబర్ మోసాలు, వేధింపులు.. వాటిని ఎలా ఎదుర్కొవాలి.. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నవారికి ఎలా ఒక సైబర్ అంబాసిడర్గా అండగా ఉండవచ్చన్న అంశాలను నేర్పుతున్నారు.