సంగారెడ్డి : ముంబై – పుణె- హైదరాబాద్ వెళ్లే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కు వయా జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కనెక్టివిటీ ఇవ్వాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రధాన కార్య నిర్వహణాధికారి ఆర్ఎన్ సింగ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..జహీరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అన్నారు.
ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయయని తెలిపారు. అదేవిధంగా ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో దాదాపు 12000 వేల ఎకరాల్లో (NIMZ) నిమ్జు ప్రాజెక్టు కూడా మంజూరు అయిందన్నారు. ఇక్కడకు అంతర్జాతీయ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ప్రజల కోరిక మేరకు బుల్లెట్ ట్రైన్ ను జహీరాబాద్కు కనెక్టివిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి