ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు
పల్లె ప్రగతితో అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం
ఇంటింటా మొక్కల పెంపకం
పారిశుద్ధ్య నిర్వహణతో పరిసరాలు శుభ్రం
మెండోరా, మార్చి 18: పరిశుభ్రతకు కేరాఫ్గా పోచంపాడ్ గ్రామం నిలుస్తోంది. గతంలో సోన్పేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామం రాష్ట్ర ప్రభుత్వం నూతన జీపీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోచంపాడ్ కూడా నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఏర్పాటు, ప్రత్యేకంగా నిధులు మంజూరు కావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పంచాయతీకి ప్రభు త్వం కేటాయించిన ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రతిరోజూ చెత్తను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని సారించి పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. పోచంపాడ్ ప్రాజెక్ట్కు నిత్యం సందర్శకుల తాకిడి ఉం టుంది. దీంతో ఎక్కడి పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయేది. ప్రస్తుతం ప్రతిరోజూ చెత్తను సేకరిస్తుండడంతో వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
ఇంటింటా మొక్కలు
పోచంపాడ్కు ప్రత్యేకత శ్రీరాంసాగర్ ప్రాజె క్టు. ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పటి నుంచే గ్రామంలో మొక్కల పెంపకం ఎక్కువగానే ఉండేది. ఇప్పటికీ ప్రతిఇంటి ఆవరణలో పూలమొక్కలు, చెట్లు కనిపిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పోచంపాడ్ హరితగ్రామంగా మా రింది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. రోడ్ల పక్కన, ఇంటి ఆవరణల్లో మొక్కలను సంరక్షించ డానికి ట్యాంకర్ ద్వారా ప్రతిరోజూ నీళ్లు పడుతుంటారు.
పంచాయతీ భవనం ఆధునీకరణ
నూతన పంచాయతీ కావడంతో జీపీ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. దీంతో గ్రామంలో రూ.25లక్షలతో సీసీ రోడ్లు, అంతర్గత తారురోడ్లను నిర్మించారు. రూ.12 లక్షలతో సీసీ డ్రైనేజీలను నిర్మించారు.
ఆదర్శ గ్రామంగా నిలుపుతాం
రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేస్తున్న నిధులతో గ్రామం లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలుపుతాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నాం. అభివృద్ధి పనుల్లో అలసత్వానికి చోటులేకుండా పర్యవేక్షిస్తున్నాం.