నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడిని జిల్లాలోని తిప్పర్తి నివాసి కె. శ్రీకాంత్(28)గా గుర్తించారు. భార్య, కొడుకు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్ ఫ్యాన్కు వేలాడుతుండటాన్ని చూసిన ఇరుగుపొరుగు వెంటనే తలుపులు తెరిచి చూశారు. అప్పటికే అతడు చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. నల్లగొండ వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.