గ్రేటర్ వార్..9,101 పోలింగ్ బూత్లు..74 లక్షల మంది ఓటర్లు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కోసం 18వేల 202 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. కొవిడ్-19కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్లు, 74 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
'అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. పోలింగ్ పర్యవేక్షణకు 661 మంది జోనల్ అధికారులు ఉంటారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులు వాడుతున్నాం. మొత్తం 81,88,686 బ్యాలెట్ పత్రాలు ముద్రించాం. ఎన్నికల నియమావళి అమలుకు 19 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పోలింగ్ విధుల్లో 45వేల మంది సిబ్బందిని కేటాయించాం. ప్రతి సర్కిల్కు ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్ ఉంటారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. శానిటైజర్ వాడాలి. సామాజిక దూరం పాటించాలని' కమిషనర్ కోరారు.
'ఇప్పటి వరకు 92.04 శాతం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తైంది. మైలార్దేవ్పల్లిలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. రామచంద్రాపురం డివిజన్లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 2వేల 629 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారని' కమిషనర్ పేర్కొన్నారు. డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్-150, బీజేపీ-149, కాంగ్రెస్-146, టీడీపీ 106, ఎంఐఎం-51 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!