ఘనంగా ప్రారంభమైన ఉర్సు
ప్రత్యేక ప్రార్థనలు చేసిన మత గురువులు
దర్గాకు పోటెత్తిన భక్తులు
దామెర, ఏప్రిల్ 2 : మండలంలోని ఓగ్లాపూర్ సైలానీబాబా గంధం ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. సైలానీబాబాను దర్శించుకుని, మొక్కులు చెల్లించేందుకు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్గా ప్రాంతం జనసంద్రంగా మారింది. వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిని ఆనుకుని దర్గా ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కాగా, రాత్రి దర్గాలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చాదర్ సమర్పించారు. అర్ధరాత్రి తర్వాత దర్గా పీఠాధిపతి హజ్రత్ పీర్ హాజ మహమ్మద్ అబ్దుల్ హమీద్ షామియా(సైలానీబాబా) అశేష భక్తజనం, డప్పుచప్పుళ్ల మధ్య ఒంటెపై గంధాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజొద్దీన్, సర్పంచ్ కేతిపల్లి సరోజనారెడ్డి, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, జడ్పీటీసీ కల్పనాకృష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, సర్పంచ్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీరాంరెడ్డి, రాజేశ్వరీ ఈశ్వర్, వడ్డేపల్లి శ్రీనివాస్, బింగి రాజేందర్, పుల్యాల రాణీ రఘుపతిరెడ్డి, కుక్క శ్రావణ్య అనీల్, గట్ల విష్ణువర్ధన్ రెడ్డి, పున్నం రజిత, గోవిందు అశోక్, సాంబయ్య, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, దుబాసి శ్రీలత, గండు రాము, గోవిందు సంధ్యా అశోక్, సంగనబోయిన మౌనికా కిరణ్, నవీద్బాబా, ఓబెద్బాబా, సిద్దిఖ్పాషా, సయ్యద్ ముగ్దుం, రషీద్, ఎస్కే మోయిన్, కొమ్మాలు, సీఐ రమేశ్కుమార్, ఎస్సై భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్పై నేడు నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం