Sleep | హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పెద్దలు రోజులో 6-7 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో చాలా మంది కంటి నిండ నిద్ర పోవడం లేదు. రాత్రి పూట ఎలాంటి ఆటంకాలు లేకుండా కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోని పరిస్థితి నెలకొన్నది. మార్చి 17 ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ నెట్వర్ సంస్థ లోకల్ సరిల్స్ దేశవ్యాప్త సర్వేను నిర్వహించింది. ‘భారతదేశం ఎలా నిద్రపోతున్నది?’ అంశంపై జాతీయ అధ్యయనాన్ని చేపట్టింది.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 39,000 కంటే ఎకువ మందిని ఆన్లైన్ ద్వారా సంప్రదించింది. వారు నిద్రపోతున్న తీరు సమాచారం సేకరించింది. నిద్ర పోయే వేళలపై కరోనా ఏమైనా ప్రభావం చూపిందా? అన్న అంశాన్నీ అధ్యయనం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఇటీవలే వెల్లడించింది. చాలా మంది భారతీయులు నిర్దేశించిన గంటలు నిద్రపోవడం లేదని సర్వేలో తేలింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆరు గంటల కంటే తకువ సమయం నిరాటంకంగా నిద్రపోతున్న వారి సంఖ్య 50 శాతం నుంచి 55 శాతానికి పెరగటం ఆందోళనకు గురిచేస్తున్నది. 21 శాతం మంది 4 గంటల పాటే నిరాటంకంగా నిద్రపోతున్నారని సర్వే తెలిపింది.