నల్లగొండ : నాగార్జున సాగర్లో విషాదం నెలకొంది. నిన్న అదృశ్యమైన జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు దంపతులు, కుమారుడు ఉన్నారు. తమ చావుకు తామే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే జెన్ కో ఉద్యోగి కుటుంబం నిన్న సాయంత్రం కొత్త బ్రిడ్జిపై నుంచి కృష్ణా నదిలో దూకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం చింతలపాలెం వద్ద కృష్ణా నదిలో బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు భావిస్తున్నారు.