హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేరొన్నారు. దళిత బంధు పథకానికి రూ. 500 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు.
ఈ నెల 16న సీఎం కేసీఆర్ సభకు దళితులమంతా తరలివెళ్తామని స్పష్టం చేశారు. తమ గ్రామంలోనే కాకుండా అన్ని చోట్ల గెల్లు శ్రీనివాస్ను గెలిపించేందుకు తీర్మానం చేసి, కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ తిరుమల తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మధుకర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్, తదితరులున్నారు.