హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్ చౌరస్తా, సెప్టెంబర్ 16: ‘నేను కడు పేదరికంలో పెరిగిన బిడ్డను. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల బాధలు తెలుసు. మీలో ఒకడిగా ఉంట. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడుం ట. ఎప్పుడు పిలిచినా వస్తా.. సమస్యల పరిషారానికి కృషి చేస్తా. ఉద్యమంలో పనిచేసిన. ఎన్నో కేసులు పెట్టి నా భయపడకుండా సీఎం కేసీఆర్ వెంట నడిచిన. బడు గు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి’ అం టూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ విన్నవించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లో ఎమ్మెల్యే సతీశ్బాబు, మాజీమంత్రి పెద్దిరెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ.. దేశంలో ఎక డా లేనివిధంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేసిందేమి లేదన్నారు.
గెల్లుకు నీరాజనం
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సింగాపూర్ ప్రజానీకం నీరాజనం పట్టింది. ఎమ్మెల్యే సతీశ్, మాజీమంత్రి పెదిరెడ్డితో కలిసి వాడవాడలా ఇంటింటికీ కలియదిరిగారు. డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు, ప్రజ లు తరలివచ్చి గెల్లుకు అపూర్వ స్వాగతం పలికారు.