హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనతోపాటు ఇల్లందకుంట మండల ఇన్ఛార్జ్ లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్ సుడా చైర్మన్ జీ.వీ రామకృష్ణారావు,ఎంపీపీ పావని వెంకటేష్, గ్రామ సర్పంచ్ పసునూటి మానస- మహేందర్, ఉప సర్పంచ్ చల్ల మోహన్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు పసునూటి రాజి రెడ్డి, సీనియర్ నాయకుడు జలపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.