వ్యాపారవేత్త, టీఆర్ఎస్ నాయకుడు గుడాల రాజేశ్గౌడ్ ఆదివారం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల ప్రాంతంలోని గీత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణాగౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్గౌడ్ ఉన్నారు.