హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవం (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, సైన్స్ విద్యార్థులకు నియామకపత్రాలను అందజేశాయి. 2020-21లో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్లో ప్రాంగణ నియామకాలు నిర్వహించి.. 903 మంది విద్యార్థులను ఎంపికచేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టెక్చువా సీఈవో శ్రావణ్రెడ్డి విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్, వైస్ చాన్సులర్ ఎన్ శివప్రసాద్, జీహెచ్బీఎస్ డీన్, డైరెక్టర్ బీ కరుణాకర్, ప్రిన్సిపాళ్లు జీఎస్ కుమార్, జీఏ రామారావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ఎన్ సీతారామయ్య, వైస్ ప్రిన్సిపాల్ అక్కలక్ష్మి, కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ నాతి వేణుకుమార్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.