ఢిల్లీ ,మే 2: మరోసారి కరోనా దెబ్బ ఆటోరంగంపై తీవ్రంగా పడింది. దీంతో ఏప్రిల్ నెలలో వాహనాల సేల్స్ భారీగా క్షీణించాయి. టాటా మోటార్స్ డొమెస్టిక్ వెహికిల్ సేల్స్ ఏడాదిలో 41 శాతం క్షీణించగా, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 9.5 శాతం తగ్గాయి. మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 11 శాతం పడిపోయాయి. మార్చి నెలలో టాటా మోటార్స్ 66,609 వాహనాలను విక్రయించినట్లు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొన్నది. ఏప్రిల్ నెలలో ఈ సేల్స్ 40.6 శాతం తగ్గి 41,739కి పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 70,263 వెహికిల్స్ అమ్ముడయ్యాయి. ఇందులో కమర్షియల్ వాహనాల ఎగుమతులు 40 శాతం తగ్గి 2,209కి పరిమితమయ్యాయి.మారుతీ సుజుకీ విక్రయాలు ఏప్రిల్ నెలలో నాలుగు శాతం తగ్గి 1,59,691 యూనిట్లకు క్షీణించాయి.
మార్చినెలలో 1,67,014 కార్లని విక్రయించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాహన సరఫరాకి ఇబ్బందులు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. 2020 ఏప్రిల్ నెలలో పూర్తిస్థాయి లాక్డౌన్ కారణంగా మారుతి ఒక్క కారునూ విక్రయించలేదు. రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుండాయ్ మార్చ్ విక్రయాలు 8 శాతం తగ్గి 64,621 యూనిట్ల నుంచి 59,203కు తగ్గాయి.