హుజూరాబాద్, సెప్టెంబర్ 22: ‘టీఆర్ఎస్ సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు వంటి పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు భరోసానిస్తుంది.. ఇందుకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం ప్రభుత్వ రంగసంస్థలను అమ్మకానికి పెడుతూ, నల్లచట్టాలు చేసి రైతుల నోట్లో మట్టిగొడుతున్నది. హుజూరాబాద్లో పోటీచేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను పరిగెతో పోల్చి ప్రజలను అవమానించిండు. ప్రజలరా మీరు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ వైపు ఉంటారా?.. పథకాలను వెక్కిరించి పేదలను అవమానించిన బీజేపీవైపు ఉంటారా? ఆలోచించాలి’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకుల ను కల్యాణలక్ష్మి వంటి పథకాలు బీజేపీ రాష్ర్టాల్లో ఎందుకు లేవని నిలదీయాలన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.