హైదరాబాద్: గాంధీ దవాఖానకు వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు ఆదేశించారు. ఈమేరకు వివిధ విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీచేశారు. దవాఖానకు వచ్చే రోగులకు సంబంధించి ఆర్టీ పీసీఆర్ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. కొవిడ్ రోగులను తీసుకువచ్చే అంబులెన్సులను ఆపకూడదని పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు మళ్లీ పూర్తిస్థాయి కొవిడ్ హాస్పిటల్గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిపార్ట్మెంట్ హెడ్లను సూపరింటెండెంట్ రాజారావు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..