మద్దతు తెలుపుతూ యాదవ సంఘం ఏకగ్రీవ తీర్మానం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోసుల శ్రీనివాస్యాదవ్కు ప్రతి అందజేత
జమ్మికుంట(ఇల్లందకుంట), ఆగస్టు 1 : గొర్రెల పంపిణీతో తమ బతుకుల్లో వెలుగులు నింపిన టీఆర్ఎస్కు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి యాదవ సంఘం జైకొట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ మద్దతు టీఆర్ఎస్కేనంటూ యాదవ సంఘం నాయకులు, సభ్యులు, కులస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన గొల్ల, కురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోసుల శ్రీనివాస్యాదవ్కు తీర్మాన ప్రతిని అందజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుతామని ప్రతిజ్ఞ చేశారు. జై తెలంగాణ.. జై టీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేయూతతో యాదవులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారన్నారు. గొర్రెల పంపిణీతో యాదవుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయని చెప్పారు. ప్రాణాలను పణంగా బెట్టి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇల్లందకుంట మండల ఇంచార్జి కే శ్రీనివాస్ యాదవ్, భూమయ్యయాదవ్, సర్పంచ్ లలిత రాజకొమురయ్య, సొసైటీ అధ్యక్షుడు చెవుల మల్లయ్య యాదవ్, సంఘం మండల అధ్యక్షుడు గడ్డి రాములు యాదవ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.